
రాజకీయాలు

చిన్నారి అత్యాచారం, హత్య కేసు వివరాలను వెల్లడించే సమయంలో ప్రెస్మీట్లో నవ్వుతూ కనిపించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజల పట్ల జవాబుదారీతనం, బాధితుల పట్ల సానుభూతి ప్రతి అధికారికి తప్పనిసరి లక్షణాలని పేర్కొన్నారు.
ప్రజల బాధను అర్థం చేసుకోలేని వారు ప్రజాసేవలో ఉండటానికి అర్హులు కారని స్పష్టం చేసిన విజయ్, ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సున్నితమైన కేసుల్లో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!