

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఖమేనీ వ్యాఖ్యలు నిజమో కాదో రెండు రోజుల్లో తేలుతుందని అన్నారు. రెండు రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశముందని పేర్కొన్న ఆయన, ఒకవేళ డీల్ విఫలమైతే పరిస్థితులు ఎలా మారుతాయో చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అమెరికా దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఖమేనీ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్పై దాడి జరిగితే గట్టిగా ప్రతిస్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా యుద్ధనౌకలను రంగంలోకి దించాక, ఖమేనీ ఇంత స్పష్టంగా హెచ్చరించడం ఇదే తొలిసారి. ఇరుదేశాల అగ్రనేతల పరస్పర వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిణామాలు ఏ దిశగా మలుపు తిరుగుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!