

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిని తప్పుబట్టారు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ దాడి జరగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో చేసిన వ్యాఖ్యల్లో ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు.
ఇజ్రాయెల్కు ఆత్మరక్షణ హక్కు ఉన్నప్పటికీ, జరిగిన ప్రేరేపణ పెద్దది కాదని, దాని వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని ట్రంప్ పేర్కొన్నారు. లెబనాన్లో ఇకపై దాడులు చేయవద్దని ఇజ్రాయెల్కు సూచించిన ఆయన, హెజ్బొల్లా సహా ఇతర సంస్థలు కూడా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడవద్దని కోరారు. హెజ్బొల్లా ప్రభావం ఉన్న దక్షిణ బీరుట్లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!