

తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్, మాజీ రాజ్యసభ సభ్యుడు అహ్మద్ హసన్ ఇమ్రాన్పై సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్కు చెందిన అతివాద సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ, ఈ విషయంపై పశ్చిమబెంగాల్ రాజకీయ నాయకుడు సువేందు అధికారీకు లేఖ రాశారు. సిలిగుడీ కారిడార్ వంటి సున్నిత ప్రాంతాల్లో భారత సైన్యం, బీఎస్ఎఫ్ కోరిన భూమిని కేటాయించకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే రిటబ్రత బెనర్జీ తిరుగుబాటుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కకోలీ ఘోష్ స్పష్టం చేశారు. వేర్వేరు రాజకీయ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. మరోవైపు, లోక్సభలోని సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ముదిరాయి. ఈ జాబితాలో యూసుఫ్ పఠాన్, సయోనీ ఘోష్, శత్రుఘ్న సిన్హా వంటి ప్రముఖులు ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!