

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా బుధవారం హైదరాబాద్లోని దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించి, సాంకేతికతతో పాటు మానవ సృజనాత్మకతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రతి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, దాని వినియోగం వల్ల మానవ ఆలోచనా శక్తి, సృజనాత్మకత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ కేంద్రంలోని ఇంజినీరింగ్ విభాగం, స్టూడియోలు, ఇతర సాంకేతిక విభాగాలను పరిశీలించి, ప్రసారమవుతున్న కార్యక్రమాలు, వార్తలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలపై అధికారులు చేసిన కృషిని అభినందించారు.
దూరదర్శన్ ప్రజలకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు నాణ్యమైన కంటెంట్కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంపై దూరదర్శన్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ త్వరలో దేశవ్యాప్తంగా దూరదర్శన్లో ప్రసారం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!