
సినిమాలు

తమిళనాడులో తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ పరిపాలనలో తెలుగు వ్యక్తుల పాత్రపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విధానాలు, రాజకీయ వ్యూహాలకు సలహాలు అందించేందుకు జాన్ ఆరోగ్యసామి, విష్ణురెడ్డిని అధికారిక సలహాదారులుగా నియమించినట్లు సమాచారం. ఉచిత విద్యుత్, మహిళల భద్రత, అవినీతి నిరోధక చర్యలు, ఆరోగ్య సేవల డిజిటలైజేషన్, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో వారి సూచనలు కీలకంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
రాజకీయ వ్యూహాలు, ప్రజలతో కమ్యూనికేషన్, ప్రభుత్వ నిర్ణయాల ప్రచారంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. అయితే, ప్రభుత్వ వ్యవహారాల్లో వారి ప్రమేయంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కార్యాలయం సమీపంలో వారికి చాంబర్లు కేటాయించడంపై విమర్శలు రావడంతో ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!