
రాజకీయాలు

మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళలకు 2029 సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని చారిత్రాత్మక ప్రతిపాదన చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైనా, అమలుకాకపోయినా టీడీపీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించాలని, నిర్ణయాధికారులుగా ఎదగాలని పార్టీ కట్టుబడి ఉందన్నారు.
మహిళలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారతపై టీడీపీ ఆచరణాత్మకంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడే సంస్కృతి మారాలని, సమాజంలో సమాన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని లోకేష్ వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!