
మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్కు డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కేసులో పుట్టా మహేష్, పైలట్ రోహిత్ రెడ్డి సహా మరికొంతమందికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లో మాదకద్రవ్యాల అవశేషాలు బయటపడటంతో కేసు మరింత కీలకంగా మారింది.
ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గన్మెన్లు లేకుండానే పార్టీకి వెళ్లినట్లు పుట్టా మహేష్పై సమాచారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!