

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం క్లైమాక్స్ దశకు చేరింది. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా, ప్రముఖ నేతల గైర్హాజరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొనకపోవడం గమనార్హం. ఆయన వచ్చే సూచనలు కూడా కనిపించకపోవడంతో, ఆ బాధ్యతలను కేటీఆర్ భుజాలపై పూర్తిగా వదిలేశారు. కేటీఆర్ ఇప్పటికే పలు సభల్లో పాల్గొని పార్టీ తరఫున మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అటు బీజేపీ తరఫున కూడా పరిస్థితి పెద్దగా భిన్నంగా లేదు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, ఏపీ అధ్యక్షురాలు పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ వస్తారని ప్రచారం జరిగినా, ఇప్పటి వరకు వారిలో ఎవరూ రంగంలోకి దిగలేదు. దీంతో చివరి నిమిషంలో బీజేపీ నేతలు హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రచారం తుది దశలోకి చేరుతుండటంతో, రెండు పార్టీలలోనూ టాప్ నేతల గైర్హాజరు ఓటర్లలో మిశ్రమ స్పందనకు దారి తీస్తోంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!