
రాజకీయాలు

జవహర్ నగర్ డంప్ యార్డ్ను తరలించాలని కోరుతూ యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. డంప్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య మరియు పర్యావరణ సమస్యలను వారు వివరించారు. ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఈ సమావేశంలో ఈటెల రాజేందర్, చామకూర మల్లారెడ్డి తో పాటు మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ శంకర్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. డంప్ యార్డ్ను తక్షణమే తగిన ప్రదేశానికి తరలించాలని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి వినతి చేశారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!