
గాసిప్స్

దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జస్టిస్ బాలకృష్ణ కమిషన్కు వినతిపత్రం సమర్పించారు. న్యూఢిల్లీలో కమిషన్ చైర్మన్ను కలిసిన ప్రతినిధి బృందం, మతం మారినప్పటికీ దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్యా వెనుకబాటుతనాన్ని వివరించింది.
విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలలో సమాన అవకాశాలు కల్పించాలంటే వారికి ఎస్సీ హోదా ఇవ్వడం అవసరమని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. ఈ బృందంలో జూపూడి ప్రభాకరరావు, ఎంపీలు గురుమూర్తి, బాబురావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!