

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులో లిఖితపూర్వక దరఖాస్తు సమర్పించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి బుధవారం రాహుల్ తరఫు న్యాయవాది ఈ దరఖాస్తు అందజేశారు.
2018లో జబువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో కార్తికేయ సింగ్ను పనామా పేపర్ల లీకేజీ వివాదంతో అనుసంధానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తనకు పరువు నష్టం కలిగిందని పేర్కొంటూ కార్తికేయ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యేల కోర్టులో కేసు వేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలు కార్తికేయ సింగ్ను ఉద్దేశించి కావని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రమోద్ కుమార్ అగర్వాల్ తీర్పును వాయిదా వేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!