

మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నిర్వహించిన నిరసనకు సంబంధించి వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా తదితరులపై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 10న శంకరవిలాస్ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ప్రదర్శన నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పాటు ప్రజా రవాణా, ట్రాఫిక్కు అంతరాయం కలిగించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని అరండల్పేట ఎస్ఐ ఈశ్వరరావు ఫిర్యాదు చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని పోలీసులు సూచించినప్పటికీ ఆదేశాలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నూరి ఫాతిమా, రాజనారాయణతో పాటు మొత్తం 17 మంది వైఎస్సార్సీపీ నాయకులు, పలువురు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!