
సినిమాలు

ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు రావడంతో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామంపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేస్తూ పంజాబీలను లక్ష్యంగా చేసుకుని పార్టీని బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా బీజేపీ మళ్లీ “ఆపరేషన్ లోటస్” ప్రారంభించిందని ఆరోపించారు. ఎంపీలను ప్రలోభపెట్టి పార్టీ మార్పిస్తున్నారని, ఈ చర్యలు ప్రజల నమ్మకానికి ద్రోహమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి చర్యలను ఎప్పటికీ క్షమించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!