
న్యూస్

ఉగాది పండుగ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వసంత ఋతువు రాకను, కొత్త ఆరంభాల స్పూర్తిని తెలియజేసే పండుగగా ఉగాది ప్రాముఖ్యతను ఆయన వివరించారు. కొత్త శక్తి, కొత్త అవకాశాలకు ఉగాది ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులు తదుపరి వ్యవసాయ చక్రానికి సిద్ధమయ్యే సమయం ఇదేనని, ప్రకృతితో మనిషి అనుబంధాన్ని గుర్తుచేసే పండుగగా ఉగాదిని అభివర్ణించారు. జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలని సూచించే సంప్రదాయ ఉత్సవం ఉగాది అని తెలిపారు.
ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, ఆనందం, సంతోషం తీసుకురావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!