

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి ఆదివారం నాందేడ్లోని తఖ్త్ సచ్ ఖండ్ గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ గురు గోవింద్ సింగ్ జీ సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు, సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటైన హజూర్ సాహిబ్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్కు సిక్కు సంప్రదాయ తలపాగాను ధరింపజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన మందిరంలో చాదర్ సమర్పించి, గురుద్వారా గ్రంథీల ద్వారా పవిత్ర వస్త్రాలు ధరించి ఆశీర్వాదాలు పొందారు.
దర్శనం అనంతరం, పవన్ కళ్యాణ్ మరియు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కలిసి గురుద్వారాలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ, శ్రీ గురు తేగ్ బహదూర్ జీ చేసిన త్యాగం దేశమంతటికి , భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన షాహిదీ స్మరణ కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!