
జనరల్

ప్రజా ఉద్యమాల ద్వారా ఎదిగి కాఠ్మాండూ మేయర్ స్థాయి నుంచి నేపాల్ ప్రధానిగా మారిన యువ నాయకుడు బాలేన్ షాపై ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం నెలకొంది. భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలు విపక్షాలు, విద్యార్థి సంఘాలు, మీడియా తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
బాలేన్ షా సరిహద్దు వివాదం ఏకపక్షం కాదని, కాళీ నది ప్రాంతానికి సంబంధించిన బ్రిటిష్ కాలం నాటి మ్యాప్లను పరిశీలించాలని, అవసరమైతే మధ్యవర్తిత్వం కోరాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై కాఠ్మాండూలో భారీ నిరసనలు చెలరేగాయి. భారత్ ఈ వివాదాలు ద్వైపాక్షిక అంశాలేనని స్పష్టం చేసింది. నేపాల్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ స్థాయిలో విభిన్న వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!