

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్కతాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో ముఖ్యమంత్రిని సత్కరించిన లోకేష్, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం, పారదర్శక సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్, రియల్-టైమ్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా రాష్ట్ర పాలనలో సాధించిన ఫలితాలను వివరించారు.
రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని లోకేష్ ఆకాంక్షించారు. పశ్చిమ బెంగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరగా, తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మత్స్య సంపద, ఎగుమతులు తదితర రంగాల్లో పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. లోకేష్ ప్రతిపాదనలపై పశ్చిమ బెంగాల్ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!