

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఒక ఆప్త మిత్రుడిని, తెలంగాణ ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పోలీసు కేసులు, జైలు నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో ముందుండి పోరాడిన ధీరుడిగా ఆయనను కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పెద్ది మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!