

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం అమలవుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సామాజిక వైద్యుడు, సామాజిక విప్లవకారుడిగా అభివర్ణిస్తూ, ఆయన పాలన వందేళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షించారు.
అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని పూర్తిగా అయిపోయిందని, ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇక తెలంగాణలో బీజేపీకి కూడా అవకాశమే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరని మల్లు రవి అన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!