

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో క్యాబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కేవలం మంత్రులు కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలిపారు.
కొండా సురేఖను కాపాడేందుకు అందరం తీవ్రంగా ప్రయత్నించామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే సురేఖ విషయంలో తమ ప్రతిపాదనకు హైకమాండ్ అంగీకరించలేదని పేర్కొన్నారు. క్యాబినెట్ విస్తరణపై ఇప్పటివరకు హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు.
క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు చేపట్టాలనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తనకు మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారంపై కూడా తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ విషయంలో ఏఐసీసీ అంగీకరించలేదని మరోసారి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!