

తెలంగాణవ్యాప్తంగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కరీంనగర్లో నిర్వహించిన యువ సమరభేరి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా యువత సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి వాటాలు, కమీషన్ల కోసం పోటీపడుతున్నారని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా హబ్సిపూర్లో నిర్వహించిన రైతు పొలికేక ధర్నాలో హరీశ్రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాదిరిగా మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉచిత విద్యుత్ ఉత్త విద్యుత్గా మారిందని, రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతులకు న్యాయం చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!