
జనరల్

పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఓట్ల లెక్కింపు రోజైన ఈ నెల 4న కేంద్రాల వద్ద నిరంతరం నిఘా ఉంచి ప్రతి ప్రక్రియను జాగ్రత్తగా గమనించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని ఆమె ఆరోపించారు. ఇదే సమయంలో కోల్కతాలో ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రం వద్ద తృణమూల్ నాయకులు ఆందోళన చేపట్టి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండిస్తూ, అభ్యర్థులు మరియు ప్రతినిధుల సమక్షంలోనే యంత్రాల మూసివేత జరిగిందని తెలిపింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!