

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్స్’ అనే పదప్రయోగంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. మావోయిస్టు భావజాలానికి మద్దతు ఇచ్చేవారిని ఉద్దేశించి ప్రధాని ఈ పదాన్ని ఉపయోగించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. తాజాగా కర్ణాటక బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో ‘దిమాగీ నక్సల్స్’పై పోరాటం చేస్తామంటూ పెట్టిన పోస్టుకు ‘కేజీఎఫ్ చాప్టర్-2’లోని కాల్పుల సన్నివేశాన్ని జత చేయడం వివాదానికి దారితీసింది. ఈ వీడియోలో హీరో యశ్ పాత్ర ప్రత్యర్థులపై కాల్పులు జరిపే సన్నివేశం ఉంది.
ఈ పోస్టుకు ముందు ఛత్తీస్గఢ్ బీజేపీ కూడా ‘దిమాగీ నక్సల్స్’ అంశంపై ‘మీర్జాపూర్’ వెబ్సిరీస్కు సంబంధించిన వీడియో క్లిప్ను ఉపయోగించింది. దీనికి ప్రతిస్పందనగానే కర్ణాటక బీజేపీ ‘కేజీఎఫ్-2’ క్లిప్ను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అధికారిక ఖాతాల్లో ఇలాంటి వీడియోలను ఉపయోగించడం ప్రజాస్వామిక వర్గాల నుంచి విమర్శలకు దారితీసింది. తమను ప్రశ్నించే వారిని బెదిరించేలా బలప్రయోగాన్ని సూచించే సందేశాలు ఇవ్వడం సరికాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!