
టెక్నాలజీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తమకు పెద్దగా పట్టింపు లేదని, ప్రజలు తమపై నమ్మకంతో ఓటు వేసారని సునీత చెప్పారు.
ప్రతీ చిన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని తమ ఏజెంట్లకు సూచనలు పంపినట్లు ఆమె వెల్లడించారు. ఈ సమయంలో ప్రధాన పార్టీల ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, కౌంటింగ్ కేంద్రంలోకి ఇద్దరు ఏజెంట్లను అనుమతించాలన్న సునీత అభ్యర్థనను పోలీసులు మరియు ఎన్నికల సిబ్బంది తిరస్కరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థికి ఒకే ఒక్క ఏజెంట్ను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో సునీతతో పాటు కేవలం ఒక ఏజెంట్ను మాత్రమే లోపలికి పంపారు.











కామెంట్స్ (1)
ఇక ఫలితాలే ఈ విశ్వాసానికి ఎంత బలం ఇస్తాయో చూడాలి.