

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు. తాజాగా లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈ విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. హాజరును తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నించినట్టుగా సమాచారం వచ్చినా, సీబీఐ వత్తిడి కారణంగా ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు రావాల్సి వచ్చింది.
జగన్ కోర్టుకు రావడానికి ఉపయోగించిన ప్రయాణ విధానం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఉదయం గన్నవరం నుండి హైదరాబాద్కి ఆయన ఖరీదైన ప్రైవేట్ జెట్లో ప్రయాణించారు. అదే జెట్లో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
సమాచారం ప్రకారం, ఆ చార్టర్ జెట్ గంటకు దాదాపు ₹8 లక్షలు ఛార్జ్ చేస్తుంది. ఈ మొత్తం ఫ్లైట్ గంటలతో పాటు, విమానం నేలమీద వేచివుండే సమయానికి కూడా వర్తిస్తుంది. దీంతో గన్నవరం–హైదరాబాద్–బెంగళూరు ప్రయాణం కోసం ఒక్కరోజులోనే లక్షల్లో ఖర్చు అయినట్టు అంచనా.
ఈ విషయంపై రాజకీయంగా విమర్శలు మళ్లీ చెలరేగాయి. గతంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు ఉపయోగించిన విషయంపై వ్యంగ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ స్వయంగా ఇంత ఖరీదైన ప్రైవేట్ జెట్లో ప్రయాణించడం, అప్పటి వ్యాఖ్యలనే మళ్లీ ఆయనపైకి తిప్పుతోందని రాజకీయ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!