
సినిమాలు

రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయనున్నారు. నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ కాగా ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. గత బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన జనసురాజ్ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది.
బంకీపూర్తో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ ఉపఎన్నికల్లో జనసురాజ్ పార్టీ ఎలా రాణిస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో తన పార్టీ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రశాంత్ కిషోర్కు ఈ ఎన్నిక కీలక పరీక్షగా భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!