

యూరియా పంపిణీలో అమలవుతున్న యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ చర్య రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఫోన్ ద్వారా ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి సంఘీభావం తెలిపారు. రైతుల సమస్యలను ప్రస్తావించే నాయకులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యాప్ ఆధారిత పంపిణీ విధానం మరిన్ని సమస్యలకు దారితీస్తోందని పేర్కొన్నారు. రైతుల తరఫున మాట్లాడిన వారిపై పోలీసులను ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!