

నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని సూచించారు. భూసేకరణ ఆలస్యం, అటవీ భూముల బదలాయింపు సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని అధికారులను కోరారు.
నూతన రహదారుల నిర్మాణం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీలలో ఇంజనీర్ల కొరతను డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేయాలని సూచించారు. భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ గృహ స్థలాలు కేటాయించాలని కలెక్టర్లకు చెప్పారు. వర్షాకాలంలో పారిశుధ్య కార్యక్రమాలను బలోపేతం చేసి అంటు వ్యాధులను నివారించాలని హెచ్చరించారు. అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!