

భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాజ్భవన్లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. హైదరాబాద్లో 1963 ఫిబ్రవరి 8న జన్మించిన అజారుద్దీన్, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. క్రీడా రంగం నుంచి రిటైర్ అయిన తరువాత 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. గతంలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, విజయాన్ని సాధించలేకపోయారు.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు అజారుద్దీన్కు మంత్రి పీఠం దక్కింది. గవర్నర్కు గురువారం రాత్రి ఈ విషయమై సమాచారం అందించగా, శుక్రవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం సాఫీగా ముగిసింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం బీజేపీ వర్గాల ఆగ్రహానికి కారణమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ నాయకత్వం అజారుద్దీన్పై విశ్వాసం ఉంచి మంత్రిగా అవకాశం కల్పించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!