
జనరల్

తమిళనాడులో ముఖ్యమంత్రి పదవికి విజయ్ ప్రమాణస్వీకారం చుట్టూ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వాలని విజయ్ గవర్నర్ను కోరారు. అయితే మెజార్టీ ఎమ్మెల్యేల బలం చూపించాలని గవర్నర్ సూచించారు. ఈ నేపథ్యంలో 112 మంది ఎమ్మెల్యేల జాబితాను విజయ్ గవర్నర్కు సమర్పించారు.
ప్రమాణస్వీకారం తర్వాత బలనిరూపణ చేస్తానని విజయ్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం కోసం ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఆహ్వానాలు, ఏర్పాట్లు పూర్తయ్యాయా అనే విషయంపై గవర్నర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయంపై టీవీకే వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!