
జనరల్

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎల్లుండి తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ను సందర్శించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రస్తుతం బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడంపై ఈ పర్యటనలో చర్చించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!