

గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం, కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సహా మూడు ప్రధాన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. కొండా సుష్మిత మాట్లాడిన వీడియోలతో పాటు సీఎల్పీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలను కూడా కమిటీ పరిశీలించినట్లు చెప్పారు.
కొండా సురేఖ నుంచి వివరణ తమకు అందిందని, దానిపై మరోసారి సమావేశమై పరిశీలిస్తామని మల్లు రవి తెలిపారు. రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి కొండా సురేఖపై నిన్న కొంతమంది, ఈరోజు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదులు చేస్తామని తెలిపారని, అందరి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం మరోసారి సమావేశమై అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!