

భారత యువ క్రికెటర్, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. తన అత్యంత సన్నిహిత మిత్రుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ముంబైలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్నేహితుడిని కలిసి అభినందనలు తెలియజేస్తూ వారి మధ్య ఉన్న ఆప్యాయ బంధాన్ని చాటిచెప్పారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఒకరోజు ముందు తిలక్ వర్మ క్రికెట్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు. తెలంగాణ టీ20 లీగ్లో మెదక్ ఫాల్కన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ కేవలం 56 బంతుల్లో 136 పరుగులతో అజేయ శతకం సాధించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. త్వరలో భారత జట్టుతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న తిలక్, బిజీ షెడ్యూల్ మధ్య తన స్నేహితుడి విజయ క్షణాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!