
క్రీడలు

కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ నెలకొన్న వేళ, నేడు బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డీకే శివకుమార్ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్కు 135 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
సీఎల్పీ సమావేశాన్ని పర్యవేక్షించేందుకు ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. సీఎల్పీ నేత ఎన్నిక పూర్తయిన అనంతరం డీకే శివకుమార్ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్ను కలిసే అవకాశముంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్ నాయకత్వంపై ఈ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!