

శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను బలమైన వాదనలు, స్పష్టమైన ఆధారాలతో తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం సభ వాయిదా అనంతరం తన ఛాంబర్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో, ప్రతి అంశంపై పూర్తి సమాచారం, పక్కా డేటాతో సిద్ధంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. సభలో అనవసర విషయాలు కాకుండా ఎజెండా అంశాలపైనే ఫోకస్ పెట్టాలని, జిల్లాలకు సంబంధించిన చర్చల సమయంలో అక్కడి ఎమ్మెల్యేలు గట్టిగా వాదనలు వినిపించాలని పేర్కొన్నారు.
ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా–గోదావరి జలాల వినియోగం, ఉపాధి హామీ పథకంపై కేంద్రం తెచ్చిన సవరణల బిల్లు, హిల్ట్ పాలసీ వంటి అంశాలపై బలంగా మాట్లాడాలని సీఎం సూచించారు. భారాస హయాంలో ప్రాజెక్టుల వ్యయాలు పెరిగిన విధానం, పనుల నిజ స్థితిని ఆధారాలతో బయటపెట్టాలని చెప్పారు. మంత్రులంతా తప్పనిసరిగా సభకు హాజరై ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల తరఫున నిలబడి పోరాడుతోందని స్పష్టంగా చెప్పాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!