

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీలో హాజరు సరిగా లేకపోవడం, సంతకం పెట్టి వెళ్లిపోవడం సరికాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కావడానికి అనేక మంది కార్యకర్తలు కష్టపడతారని, కాబట్టి తమ పదవికి అన్యాయం చేయొద్దని సూచించారు. సభలో కూర్చొని చర్చల్లో పాల్గొనాలని, మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
మహిళా ఎమ్మెల్యేలు కూడా చర్చల్లో చురుకుగా పాల్గొనాలని, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేయాలని, గత ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై సమగ్రంగా సిద్ధం కావాలని అన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలకు సమయం కేటాయించాలని, విప్లు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీలో పనితీరును భవిష్యత్తులో బీ ఫారమ్ ఇవ్వడంలో పరిగణలోకి తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!