
రాజకీయాలు

నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. అలాగే ట్రిపుల్ఆర్ పనుల వేగవంతంపై కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం జరపనున్నారు. హైదరాబాద్–అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, కాజీపేట రైల్వే డివిజన్పై కూడా వినతి చేయనున్నారు.
మూసీ ప్రాజెక్టుకు అదనపు నిధులు, ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర సహాయం కోసం విజ్ఞప్తి చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులపై కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలక చర్చలు జరగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!