

తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్ర గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై జరిగిన లఘు చర్చలో మాట్లాడుతూ, తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతలేని లేదా కృత్రిమ నెయ్యి వినియోగించారని, అందులో జంతు కొవ్వు కలిసినట్టు సిట్ అనుబంధ ఛార్జిషీట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇది శ్రీవారి పవిత్రతను దెబ్బతీయడానికి జరిగిన పెద్ద కుట్రలో భాగమని ఆయన అన్నారు. తితిదే వ్యవహారాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించారని, గత పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు హిందూ భావోద్వేగాలను దెబ్బతీశాయని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో సంస్కరణలు ప్రారంభించామని సీఎం తెలిపారు. లడ్డూ మరియు అన్నప్రసాదం తయారీలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ధ్రువీకరించిన పదార్థాలనే వినియోగిస్తూ నాణ్యతను కాపాడుతున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యాల కోసం అదనపు ఆహార కౌంటర్లు, ఆధునిక వంటశాలలు, పాలు పంపిణీ వంటి చర్యలు చేపట్టామని వివరించారు. సాధారణ భక్తులకు దర్శనం సమయం పెంచేందుకు బ్రేక్ దర్శనాలను నియంత్రించామని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తూ ఎదుర్కొన్నానని, దేవాలయాల పవిత్రతను కాపాడాలని రాజకీయ నాయకులకు ఆయన సూచించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!