
క్రీడలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కనీసం ఏడు రోజుల పాటు కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్రంలోనే కొనసాగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా భద్రతా దళాలను వెంటనే ఉపసంహరించబోమని స్పష్టం చేశారు.
బెహాలాలో నిర్వహించిన రోడ్షో అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బెహాలా ప్రాంతంలో రేపు రెండో మరియు తుది దశ పోలింగ్ జరగనుంది. “29న తప్పకుండా వెళ్లి ఓటు వేయండి. గూండాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ పోలింగ్ కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!