
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత కూడా ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేయకూడదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు. ప్రాంతీయ అవసరాలు, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భోగాపురం, విశాఖ విమానాశ్రయాలు రెండూ కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నానికి కొత్త కంపెనీలు, పెట్టుబడులు భారీగా వస్తున్న నేపథ్యంలో నగరానికి విమానాశ్రయ సౌకర్యం అత్యంత అవసరమని ఆయన అన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను భోగాపురం నుంచి నిర్వహిస్తూ, దేశీయ విమాన సర్వీసులను విశాఖపట్నం నుంచి కొనసాగించాలని సూచించారు. ఈ విధానం ప్రాంతీయ అభివృద్ధికి, ప్రయాణికుల సౌకర్యానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!