
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరాన్తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడ కొనసాగుతున్న యుద్ధ వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు అనుసరించాలని తెలిపారు.
ఇరాన్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భారత ఎంబసీలు, కాన్సులేట్లతో సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు. తెలంగాణ ప్రజల భద్రతే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!