

రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహనను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్క్రబ్ టైఫస్ పరిస్థితి పై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్తో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఇటీవల విజయనగరం జిల్లాలో ఈ వ్యాధి బారినపడి చందక రాజేశ్వరి అనే మహిళ మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజేశ్వరి మరణానికి దారితీసిన పరిస్థితులను సౌరభ్ గౌర్ సీఎం కు వివరించారు.
విజయనగరానికి చెందిన రాజేశ్వరిని చిగ్గర్ మైట్ అనే కీటకం కుట్టిందని, మొదట ఆమెకు టైఫాయిడ్ అనుమానంతో చికిత్స అందించారని తెలిపారు. అనంతరం ర్యాపిడ్ టెస్ట్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. విజయనగరం క్వాసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు వివరించారు.
ఓరింటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుందని, ఇది ఇతరులకు ప్రత్యక్షంగా వ్యాపించే అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. వ్యాధి తీవ్రత పెరిగేలోపు తక్షణ చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.
ఇక స్క్రబ్ టైఫస్ పై అధిక ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి పరిస్థితిని సమీక్షించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!