

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ త్వరలోనే హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ను భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇదివరకే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా భూమి కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో ఇది రెండో ఫిల్మ్ సిటీగా నిలవనుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో, ప్రభుత్వం వినోదం మరియు పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఈ సమ్మిట్ లోనే అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్ పై అధికారిక ఒప్పందం చేయనున్నారు.




















కామెంట్స్ (2)
అజయ్ దేవ్గన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడం సూపర్ న్యూస్!
Exciting news! Hyderabad is about to get a world-class film city with Ajay Devgn on board.