
సినిమాలు

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రెబల్ వర్గ నేత షణ్ముగం మాట్లాడుతూ ఇకపై తమకు ఎన్డీఏతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అలాగే విజయ్ కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. తమదే అసలైన అన్నాడీఎంకే అని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే పళనిస్వామి పై షణ్ముగం తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కుట్ర చేశారని, పార్టీ వరుస ఓటములకు ఆయనే కారణమని విమర్శించారు. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చామని తెలిపారు. పళనిస్వామి అన్ని పదవుల నుంచి తప్పుకోవాలని కూడా డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!