

దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చిన తరువాతే ప్రజల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంస్కరణలకు ముందు సిద్ధాంతాల గురించి ఎక్కువగా మాట్లాడేవారని, అయితే అవి ప్రజల జీవన సమస్యలకు పరిష్కారం ఇవ్వవని వ్యాఖ్యానించారు.
కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన సీఎం, విలువలు మరియు సిద్ధాంతాల మధ్య తేడాను వివరించారు. ప్రతి పౌరుడికి మెరుగైన జీవన ప్రమాణాలు అందాలంటే మంచి రహదారులు, నిరంతర విద్యుత్, నాణ్యమైన విద్య వంటి మౌలిక సదుపాయాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
1995 నాటికి టెక్నాలజీ ప్రాధాన్యం గుర్తించి, దానిని ముందుగానే స్వీకరించి అభివృద్ధి దిశగా పనిచేశామని చంద్రబాబు గుర్తు చేశారు. 1947 లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, 1991 వరకు ప్రపంచం భారతదేశాన్ని గమనించలేదని అన్నారు. అప్పట్లో విదేశాల్లో భారతదేశాన్ని తక్కువగా చూసేవారని, ఆర్థిక సంస్కరణల తర్వాతే ప్రపంచ దృష్టిలో దేశ ప్రతిష్ఠ పెరిగిందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడంతో దేశం గర్వపడే స్థాయిలో ముందుకు సాగుతోందని చెప్పారు. కేవలం గత 25 ఏళ్లలోనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని, దేశం ఫాస్ట్ట్రాక్లోకి వచ్చిందని వివరించారు.
గతంలో ప్రభుత్వ రంగంలో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ సరైన సరఫరా లేకపోయేదని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. తెలుగు ప్రజలకు ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం రావడానికి కారణం నాలెడ్జ్ ఎకానమీలో ముందుండటమే అని చెప్పారు. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రైవేటు రంగంలో ప్రారంభించిన ఇంజనీరింగ్ కాలేజీలే ఈ మార్పుకు బలమైన పునాది అని సీఎం తెలిపారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!