

టాలీవుడ్ యువ హీరో హర్షిత్ రెడ్డి నటించిన దీవాన సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకున్న తర్వాత ఇప్పుడు ఆహా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోగా, జూలై 31 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సభ్యులకు 24 గంటల ముందుగానే ఎర్లీ యాక్సెస్ లభించనుంది.
ఈ చిత్రంలో బాధ్యతలు పట్టించుకోని మున్నా జీవితంలో అమూల్య ప్రవేశించడం కథకు ప్రధాన మలుపుగా నిలుస్తుంది. తన ప్రేమను అంగీకరించాలంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అమూల్య పెట్టిన షరతుతో మున్నా జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం ప్రారంభిస్తాడు. ప్రేమ, కుటుంబ బాధ్యతలు, ఆత్మవిశ్వాసం, జీవిత విలువలను హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!