

ఐఫోన్ 18 సిరీస్తో పాటు కొత్త ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ను విడుదల చేసిన వెంటనే భారత్లో పలు పాత ఐఫోన్ మోడళ్ల ధరలను యాపిల్ పెంచినట్లు సమాచారం. ఐఫోన్ 18 సిరీస్ ప్రారంభ ధర రూ.1,64,900గా ఉండగా.. ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో ధర రూ.2,99,900 నుంచి మొదలవుతోంది. మరోవైపు ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 16 మోడళ్ల ధరలను కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే భారత్లో వీటి ధరలు దాదాపు 10–15 శాతం అధికంగా ఉన్నట్లు సమాచారం.
ధరల పెంపుపై సోషల్ మీడియాలో ఇప్పటికే సెటైర్లు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక ధరలు దేశీయ ఐఫోన్ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2026 క్యాలెండర్ సంవత్సరంలో భారత్లో ఐఫోన్ విక్రయాల పరిమాణం స్వల్పంగా తగ్గొచ్చని ఐడీసీ ఇండియా, కౌంటర్పాయింట్ అంచనా వేసినట్లు సమాచారం. అయితే విక్రయాల విలువ 6–7 శాతం వరకు పెరగొచ్చని పేర్కొన్నాయి. ధరలు పెరగడం వల్ల గ్రే మార్కెట్ విక్రయాలు, వ్యక్తిగత దిగుమతులు పెరిగి అధికారిక రిటైల్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!