
గాసిప్స్

తెలుగు నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. శరణ్ కొపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్తోనే మంచి ఆసక్తిని రేపింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇది శోభితాకు తొలి తెలుగు ఓటీటీ డెబ్యూ కావడం విశేషం. ఇందులో నటుడు విశ్వదేవ్ రాచకొండ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ‘చీకటిలో’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ట్రైలర్తో ఏర్పడిన అంచనాలు సినిమా మీద మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!