
జనరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 4న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, జూలై 9 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, శివరాజ్కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!